తిరుపతి, ఆగస్టు 15, 2026: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, టీటీడీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఏవీఎస్వో శ్రీ జనార్ధన్ పరేడ్ కమాండర్గా వ్యవహరించిన ఈ పరేడ్ ఆకట్టుకుంది.
38 మంది అధికారులు, 287 మంది ఉద్యోగులకు సత్కారం
ఈ సందర్భంగా వివిధ టీటీడీ విభాగాలకు చెందిన 38 మంది అధికారులు, 281 మంది ఉద్యోగులతో పాటు స్విమ్స్, ఎస్వీబీసీ నుంచి చెరో ఆరుగురు ఉద్యోగులను అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా సత్కరించారు.
ప్రతి అవార్డు గ్రహీతకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
62 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు
టీటీడీ ఉద్యోగుల పిల్లల్లో విద్యాపరంగా ప్రతిభ కనబరిచిన 62 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలను కూడా అందజేశారు.
ఇందులో ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 33 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4,116, పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 29 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,116 చొప్పున నగదు పురస్కారాలు అందించారు.
టీటీడీ ఉద్యోగుల పిల్లల విద్యా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను అందజేశారు.
దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రశంసలు
ఎస్వీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ విద్యార్థులు దేశభక్తి గీతాలపై రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
“ఏ దేశమేగినా, ఎందు కాలెడినా”, “భవతు భారతీ”, “అదివో అల్లదివో” తదితర దేశభక్తి గీతాలపై విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విద్యార్థుల ప్రదర్శనలు దేశభక్తి, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ సభికుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.
💬 వ్యాఖ్యలు