తిరుమల, జూలై 15, 2026: హైదరాబాద్కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో శ్రీ జగదీష్, సీఎస్వో శ్రీ మాణిక్ రెడ్డి పుల్లగుర్ల టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి చెరో రూ.1 కోటి చొప్పున విరాళంగా అందజేశారు.
వారి మొత్తం విరాళం రూ.2 కోట్లు.
టీటీడీ ఛైర్మన్కు డిమాండ్ డ్రాఫ్ట్ల అందజేత
దాతలు తమ విరాళాల డిమాండ్ డ్రాఫ్ట్లను తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి ఎ. రంగశ్రీ కూడా పాల్గొన్నారు.
ఆరోగ్య సేవలకు తోడ్పాటు
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా భక్తులకు మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి టీటీడీ కృషి చేస్తోంది.
ఈ సేవా కార్యక్రమానికి విశేషంగా తోడ్పాటునందించిన దాతలకు టీటీడీ కృతజ్ఞతలు తెలిపింది.
💬 వ్యాఖ్యలు