తిరుమల, ఆగస్టు 16, 2026: నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోటాలను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
నవంబర్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోటా విడుదల తేదీలు, సమయాలను ముందుగానే గమనించుకోవాలని టీటీడీ సూచించింది.
ఆగస్టు 18 – శ్రీవారి ఆర్జిత సేవలు
ఆగస్టు 18 ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 20 ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
ఎంపికైన భక్తులకు ఆగస్టు 20 నుంచి 22 వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు చెల్లింపుల అవకాశం ఉంటుంది.
ఆగస్టు 21 – ఆర్జిత సేవలు, వర్చువల్ సేవ
ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం సేవల కోటాను విడుదల చేయనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ, దర్శనం స్లాట్లను విడుదల చేస్తారు.
ఆగస్టు 24 – అంగప్రదక్షిణ, ప్రత్యేక దర్శన కోటాలు
ఆగస్టు 24 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నారు.
ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల దర్శనం కోటాను విడుదల చేయనున్నారు.
ఆగస్టు 25 – రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం
నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి కోటాను విడుదల చేయనున్నారు.
అధికారిక టీటీడీ వెబ్సైట్లోనే బుకింగ్ చేసుకోవాలి
భక్తులు దర్శనం, సేవలు, వసతి బుకింగ్లను అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే చేసుకోవాలని టీటీడీ సూచించింది.
అనధికారిక వెబ్సైట్లు, సోషల్ మీడియా లింకులు, ఇతర బుకింగ్ ప్లాట్ఫారమ్లను నమ్మవద్దని భక్తులకు సూచించింది.
💬 వ్యాఖ్యలు