తిరుమల, సెప్టెంబర్ 7, 2026: రాబోయే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో ఎస్వీ మ్యూజియంను ప్రారంభించనున్న నేపథ్యంలో, అన్ని విభాగాలు తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరి ఆదేశించారు.
సోమవారం తిరుమలలో సంబంధిత అధికారులతో మ్యూజియం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన అదనపు ఈవో అనంతరం మ్యూజియం ప్రాంగణాన్ని పరిశీలించారు.
మ్యూజియంలోని అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలి
భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు.
ప్రతి విభాగం తమకు అప్పగించిన పనులను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
మ్యూజియం నిర్వహణకు సంబంధించి టీసీఎస్ (TCS) బృందానికి అవసరమైన సమాచారం, మార్గదర్శకాలను అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అదనపు ఈవో స్పష్టం చేశారు.
తిరుమలలో మొబైల్ నెట్వర్క్ వ్యవస్థపై సమీక్ష
అదనపు ఈవో తిరుమలలోని మొబైల్ సిగ్నల్ వ్యవస్థ, సెల్ టవర్ల పనితీరును కూడా సమీక్షించారు.
రాబోయే వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల, ఘాట్ రోడ్లు, మెట్ల మార్గాల్లో భక్తులకు మెరుగైన మొబైల్ నెట్వర్క్ సౌకర్యాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గరుడసేవ రోజు నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి
భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే గరుడసేవ రోజున మొబైల్ సిగ్నల్ బలంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు ఈవో సూచించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచి, అంతరాయం లేకుండా మొబైల్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తిరుమల, ఘాట్ రోడ్లు, మెట్ల మార్గాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న, పనిచేస్తున్న సెల్ టవర్ల సంఖ్య, వాటి పనితీరును అధికారులు సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి సమీక్షించారు.
అన్ని సెల్ టవర్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి
అందుబాటులో ఉన్న అన్ని సెల్ టవర్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని సర్వీస్ ప్రొవైడర్లను అదనపు ఈవో ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తకుండా అన్ని సాంకేతిక ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీ సోమనారాయణ, ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీ శ్రీనివాసరావు, డీఈ శ్రీ చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు