తిరుపతి, జూలై 25, 2026: హర్యానాలోని కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అసిస్టెంట్ షరాఫ్గా పనిచేస్తున్న పి. గిరి అనే ఉద్యోగిని టీటీడీ శనివారం సస్పెండ్ చేసింది.
టీటీడీ విజిలెన్స్ నిర్వహించిన విచారణలో, సదరు ఉద్యోగి టీటీడీ పేరుతో భక్తుల నుంచి అన్నదానం, కల్యాణోత్సవం, వాహన సేవల పేర్లపై డబ్బులు వసూలు చేసినట్లు తేలింది.
టీటీడీ క్రమశిక్షణ చర్య
విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేస్తూ టీటీడీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.
భక్తుల విశ్వాసాన్ని కాపాడటం, టీటీడీ సేవల్లో పారదర్శకతను కొనసాగించడం, టీటీడీ పేరుతో ఎలాంటి అనధికారిక వసూళ్లను సహించబోమనే సందేశాన్ని ఈ చర్య ద్వారా టీటీడీ స్పష్టం చేసింది.
💬 వ్యాఖ్యలు